ఖిలావరంగల్, ఏప్రిల్ 11 : శివనగర్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. శివనగర్ పద్మశాలి కల్యాణ మండపంలో మాజీ కార్పొరేటర్ శామంతుల ఉష, శ్రీనివాస్ దంపతులకు ఆదివారం స్థానిక నాయకులు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నన్నపునేని పాల్గొని మాట్లాడుతూ శివనగర్ ముంపునకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, సాదుల దామోదర్, వరంగల్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, గట్ల రాంరెడ్డి, బీ భాస్కర్, ఆడెపు శ్యాం, పీ నరేందర్, మంచాల కృష్ణమూర్తి, వడ్నాల మల్లయ్య, విజయా రాంచందర్, అంజమ్మ, మణెమ్మ పాల్గొన్నారు.
బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
ఖిలావరంగల్ మైదానంలో సోమవారం జరుగనున్న మంత్రి కేటీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు. వేదిక నిర్మాణంపై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం క్రీడామైదానంలో యువకులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఆయన వెంట జూడో రాష్ట్ర కార్యదర్శి కైలాస్ యాదవ్, గుమస్తాల సంఘం అధ్యక్షుడు ఇనుముల మల్లేశం, సులగం వేణుగోపాల్, కాసుల ప్రతాప్, కొత్తపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
జర్నలిస్టు కాలనీ స్థలం పరిశీలన
పోచమ్మమైదాన్ : గ్రేటర్ పరిధి దేశాయిపేటలోని ఎన్పీఆర్ నగర్ సమీపంలో ఏర్పాటు చేయనున్న జర్నలిస్టు కాలనీ స్థలాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదివారం రాత్రి పరిశీలించారు. మంత్రి కేటీఆర్ సోమవారం జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్లి, శంకుస్థాపన శిలాఫలకం, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే, ఎల్బీనగర్లో షాదీఖాన శంకుస్థాపన పనులను కూడా పరిశీలించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమేశ్బాబు, మాజీ కార్పొరేటర్ కావేటి కవిత, టీఆర్ఎస్ నాయకుడు సురేశ్ జోషి ఉన్నారు.
ఫూలే ఆదర్శప్రాయుడు
కరీమాబాద్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే నేటి తరానికి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఫూలే జయంతిని పురస్కరించుకుని ఉర్సు దర్గా సమీపంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫూలే సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మరుపల్ల భాగ్యలక్ష్మి, బత్తిని వసుంధర, మేడిది రజిత నాయకులు మరుపల్ల రవి, మేడిది మధుసూదన్, వనం కుమార్, బత్తిని అఖిల్, మరుపల్ల గౌతమ్, నర్మెట కుమారస్వామి, వనం మధు, ఆవునూరి రామ్మూర్తి, గుడిమెల్ల రాజు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
సిమెంటు కిటికి మీద పడి బాలుడు మృతి