బొడ్రాయిబజార్, జనవరి 12 : స్వామి వివేకానందుడి జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదాయకమని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షుడు అంగిరేకుల నాగార్జున అధ్యక్షతన బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. విద్య ద్వారానే చైతన్యం సాధ్యమని చాటిన మహాయోగి వివేకానందుడని కొనియాడారు. నేటితరం యువత ఆయన మార్గంలో పయణించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, అదనపు కలెక్టర్ మోహన్రావు, మున్సిపల్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, కౌన్సిలర్లు ఎస్కే తాహేర్పాషా, అనంతుల యాదగిరి, ఆకుల లవకుశ, పత్తిపాక వేణుధర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ అధికారి వెంకట్రెడ్డి, వివేకానంద ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ప్రభాకర్, మున్సిపల్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయంలో..
జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్ వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రంథాలయం కార్యదర్శి కె.వి.సీతారామశాస్త్రి, లైబ్రేరియన్లు రంగారావు, భాస్కర్, కౌన్సిలర్లు సురేందర్రెడ్డి, శ్రవణ్ పాల్గొన్నారు.
తిరుమలగిరి : మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం నాయకులతో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్రెడ్డి వివేకానందుడి విగ్రహానికి నివాళులర్పించారు. నాయకులు తన్నీరు రాంప్రభు, వెంకటేశ్వర్లు, రామచంద్రు, శేఖర్, లంగయ్య, చిన్ని, అశోక్ పాల్గొన్నారు.
తుంగతుర్తి : మండల కేంద్రంలో సాహితీ వేదిక జిల్లా అధ్యక్షుడు గుండగాని శ్రీనివాస్ వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీఓ ఉపేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నల్లు రాంచంద్రారెడ్డి, నాయకులు వెంకటేశ్వర్లు, దుర్గయ్య, రమేశ్గౌడ్, ఎస్ఐ ఆంజనేయులు పాల్గొన్నారు.
కోదాడటౌన్ : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వివేకానంద విగ్రహానికి టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు పూల మాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు తాజుద్దీన్, బత్తుల ఉపేందర్, పాషా,రాజు, తమలపాకుల లక్ష్మీనారాయణ, గందం పాండు పాల్గొన్నారు.
బీజేపీ, బీఎస్పీ నాయకులు నివాళులర్పించారు. బీజేపీ సీనియర్ నాయకుడు బొలిశెట్టి కృష్ణయ్య, జిల్లా నాయకుడు సాతులూరి హనుమంతరావు, పట్టణాధ్యక్షుడు నకిరికంటి జగన్మోహన్ రావు, సతీశ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పిల్లుట్ల శ్రీను, చడపంగు రవి పాల్గొన్నారు.
నడిగూడెం : మండల కేంద్రంలో బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ బెల్లంకొండ నవీన్గౌడ్ నివాళులర్పించారు. పవన్, నాగసాయి, బ్రహ్మయ్య, సాయి, జయరామ్, చరణ్ పాల్గొన్నారు.
కోదాడ రూరల్ : మండలంంలోని తొగర్రాయి గ్రామంలో యువజన సంఘం సభ్యులతో కలిసి సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆరోగ్య సిబ్బందిని శాలువాతో సత్కరించారు. యువజన సంఘం సభ్యులు నందుల లక్ష్మీనరసింహశాస్త్రి, ఏడుకొండలు, కార్యదర్శి నాగమణి, సభ్యులు పాల్గొన్నారు.