సుల్తాన్బజార్ : నిత్యం విధి నిర్వాహణలో బీజీగా ఉండే ఉద్యోగులకు క్రీడలు కాస్త ఊరట నివ్వడంతో పాటు మానసి కోల్లాసాన్నిస్తాయని రాష్ట్ర శాట్స్ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.
గురువారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ ఆధ్వర్యంలో 3 రోజులపాటు నిర్వహించనున్న 7వ స్పోర్ట్స్అండ్ గేమ్స్ 2021ను ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎం రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్ తో కలిసి ప్రారంభించారు.
అనంతరం క్రికెట్ ఆడి క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్,కోశాధికారి రామినేని శ్రీనివాసరావు వివిధ యూనిట్ల అధ్యక్ష,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
విజేతగా నిలిచిన జిల్లా విద్యా శాఖ యూనిట్ జట్టు
టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలలో మొదటి రోజు జిల్లా విద్యా శాఖ యూనిట్ విజేతగా నిలిచింది.ఈ మేరకు గురువారం జింఖానా మైదనాంలో నిర్వ హించిన క్రికెట్ పోటీలలో జిల్లా విద్యాశాఖ, ఉస్మానియా మెడికల్ కళాశాలలు తలపడ్డాయి.
ఈ పోటీలో మొదట బ్యాటింగ్ చేసిన జిల్లా విద్యా శాఖ టీం బ్యాటింగ్ చేసి 98 పరుగులు చేయగా, రెండవ బ్యాటింగ్ చేసిన ఉస్మానియా మెడికల్ కళాశాల టీం 69 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. దీంతో మొదటిరోజు విజేతగా డీఈవో యూనిట్ టీం విజేతగా నిలిచింది.