హిమాయత్నగర్ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ పోరాటం స్ఫూర్తిదాయకమని తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ అన్నారు.
పోలీస్ కిష్టయ్య 12వ వర్థంతి సందర్భంగా బుధవారం హిమాయత్నగర్ నుంచి గన్పార్కు వద్ద ఉన్న అమరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కిష్టయ్య చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమర వీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధివైపు నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ట్యాం క్బండ్పై అమరుడు పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్ ముదిరాజ్, సమన్వయకర్త బొక్కా శ్రీనివాస్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి, నాయకులు రంజిత్, సాయిరాజ్, నర్సింహ, కనకయ్య, రమేష్ చింతల ప్రకాశ్, నాగమణి, ఉషారాణి, gunసురేష్ తదితరులు పాల్గొన్నారు.