జడ్చర్ల, జనవరి 13 : వైకుంఠ ఏకాదశిని జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు గురువారం ఘనంగా జరుపుకొన్నారు. వైకుంఠ ఏకాదశినే ప్రజలు ముక్కోటి ఏకాదశిగా అనడం జ రుగుతున్నది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నియోజకవర్గంలోని వైష్ణవాలయాలను విద్యుత్ దీపాలు, పూలతో సుం దరంగా తీర్చిదిద్దారు. గురువారం తెల్లవారు జామున నుం చే ప్రజలు, భక్తులు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో వై ష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జడ్చర్ల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధర్మకర్త భీంసేనాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలతోపాటు అభిషేకం ని ర్వహించారు. క్యూలైన్ల ద్వారా వెళ్లి స్వామివారిని ద ర్శించుకున్నారు. దర్శనానికి దాదాపు రెండు గంటలకుపైగా సమయం పట్టింది. మండలంలోని గంగాపూ ర్ లక్ష్మీచెన్నకేవస్వామి ఆలయంలో భక్తులకు ఉత్తద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పా ట్లు చేయడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించారు. బాదేపల్లిలోని రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో పట్టణానికి చెందిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి దంపతులతోపాటు కౌన్సిలర్లు ఆలయా ల్లో ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణానికి చెందిన అయ్యప్పమాల ధరించిన స్వాములు గంగాపూర్లో చెన్నకేశవస్వామిని ద ర్శించుకున్నారు.
శ్రీరామకొండలో…
కోయిలకొండ, జనవరి 13 : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరామకొండలో వైకుంఠ ఏకాదశి పూజలను గు రువారం వైభవంగా నిర్వహించారు. స్వామికి ప్రత్యేక అభిషేకంతోపాటు వి విధ పూలతో శోభాయమానంగా అం కరించి విష్ణు సహస్రనామావళి పారాయణం చేశారు. వైకుంఠ ఏకాదశిని పు రస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ ఎస్.ర వీందర్రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
బాలానగర్, జనవరి 13 : మండలంలోని పెద్దాయపల్లి చౌరస్తాలో నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో వైకుం ఠ ఏకాదశిని పురస్కరించుకొని గురువారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స ర్పంచ్ శంకర్, భక్తులు పాల్గొన్నారు.
కొల్లూరులో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
నవాబ్పేట, జనవరి 13 : మండలంలోని కొల్లూరులో గురువారం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. శ్రీధర వివరామ దీక్షిత అచలగురు నిర్మలాంబ నిరంజనాదేవి, నారాయణాచార్యుల పాదపూజ కార్యక్రమా న్ని నిర్వహించారు. అనంతరం లఘు పూజ, వేదాంత విజ్ఞానసభ కార్యక్రమాలు చేశారు. మండలంలోని ఫతేపూర్ మై సమ్మ, నవాబ్పేట సాయిబాబ, గురుకుంట సాయిబాబ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో వెంకటేశం, బ్రహ్మానందచారి, తిరుపతయ్య, శివానందచార్యులు, పాండురంగయ్య చారి, మహేశ్చారి తదితరులు పాల్గొన్నారు.
పులకించిన కాంచన గుహ
దేవరకద్ర రూరల్, జనవరి 13 : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని గురువారం భక్తులు భక్తిశ్రద్ధ్దలతో స్నానా లు ఆచరించి ఆలయాలకు బారులుదీరారు. చిన్నచింతకుం ట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో గల సప్తగిరులలోని కాంచనగుహలో కొలువుదీరిన వేంకటేశ్వర స్వా మి ప్రతి రూపమైన కురుమూ ర్తి స్వామి ఆలయంలో ము క్కోటి ఏకాదశి పర్వదినాన ఆ లయ ప్రాంగణమంతా పూల తో అలంకరించారు. అర్చకు లు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అలంకర ణ, శతనామావళిలో అర్చన లు చేశారు. స్వామి వారికి శ్రీ దేవీ, భూదేవీ సమేతంగా క ల్యాణం నిర్వహించారు. స్వా మి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చి ఉత్తర ద్వారం దర్శ నం చేసుకొని పునీతులయ్యా రు. ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, ఆ లయ చైర్మన్ ప్రతాప్రెడ్డి స్వా మి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో నిండిపోయింది.
చెన్నకేశవ స్వామి ఆలయంలో…
దేవరకద్రలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామికి అర్చకులు అభిషేకా లు, అలంకరణలు నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రదక్షణలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.
శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే ఆల
మూసాపేట, జనవరి 13 : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కుటుంబ సభ్యులు తిరుపతి వేంకటేశ్వరస్వామిని గురువారం దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు ఎమ్మెల్యే ఆల తెలిపారు.