కాచిగూడ : పార్కుల సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజకీయలకు అతీతంగా నియోజకవర్గంలోని పార్క్లను అభివృద్ధి చేస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బర్కత్పురలోని బసంత్ పార్క్ను సోమవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులతో పర్యటించి పార్క్లోని సమస్యలను వాకర్స్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్క్ ద్వారం వద్ద ఆర్చ్ నిర్మాణం చేపట్టాలని, పార్క్లోకి వాకింగ్కు వచ్చేవారికి ఇబ్బందులు తలేత్తకుండా వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా సందర్శకుల కోసం పార్క్ గోడలపై వినూత్నమైన చిత్రాల వేయించి, చుట్టుపక్కల మొక్కలను నాటాలని సూచించారు.
బసంత్ పార్క్లో ఎదుర్కొంటున్న పలు సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని, పర్యావరణన్ని రక్షించడం కోసం గత ప్రభుత్వాలు చేయలేని పనులను సీఎం కేసీఆర్ చేతల్లో చేసి చూపిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం హరితహారంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పార్కుల్లో చెట్లు, మొక్కలను రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సువర్ణ, ఏఈ ప్రేరణ, హార్టికల్చర్ సూపర్వైజర్ శ్రీధర్, ఫియాజ్, కాలనీవాసులు గౌతం, రామ్గోపాల్, సంపత్, పురుషోత్తం, ఠాకుర్, వికాస్, స్వామి తదితరులు పాల్గొన్నారు.