హయత్నగర్ : ప్రయాణికుల సేవతోపాటు వారి భద్రతకు ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు ఎంతగానో కృషి చేస్తున్నారని మరొకసారి హయత్నగర్-1 డిపోకు చెందిన మహిళా కండక్టర్ శిల్ప నిరూపించింది. బుధవారం ఈ మేరకు డిపో మేనేజర్ రఘు తెలిపిన వివరాల ప్రకారం..
మంగళవారం స్వప్న అనే ప్రయాణికురాలు లక్డికాపూల్లో హయత్నగర్ డిపోకు చెందిన బస్సు నెం.(ఏపీ 11జెడ్ 2750), రూట్ 156/299లో ఎక్కి ఎల్బీనగర్లో దిగిపోయింది. అదే సమయంలో ప్రయాణికురాలు తన చేతిలోని పర్సును మరిచిపోయింది.
దీన్ని గమనించిన బస్సు కండక్టర్ శిల్ప డిపోకు సమాచారమిచ్చి డ్యూటీ ముగిసిన తర్వాత మేనేజర్కు పర్సులోని రూ.6600 నగదును అందజేసింది. టికెట్ ఆధారంగా బాధిత ప్రయాణికురాలు డిపోకు రాగా డిపో మేనేజర్ రఘు పర్సుతోపాటు నగదును అందజేశారు.
కండక్టర్ శిల్పను డిపో మేనేజర్తోపాటు అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఐ రమాదేవి, విజిలెన్స్ ఇన్చార్జి కృష్ణారెడ్డి, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.