ఖలీల్వాడి/ విద్యానగర్, జనవరి 17: కొవిడ్ మహమ్మారి రోజురోజకూ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ఒక్కరోజే 398 కరోనా కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 318 మందికి పాజిటివ్ నిర్ధారణగా అయినట్లు డీఎంహెచ్వో సుదర్శనం తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 56,931కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో 322 మందికి పరీక్షలు నిర్వహించగా.. 80 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.ఇప్పటి వరకు మొత్తం 32,089 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.
15-17 ఏండ్ల పిల్లలకు కొనసాగుతున్న వ్యాక్సినేషన్
ఖలీల్వాడి, జనవరి 17: నిజామాబాద్ జిల్లాలో 15 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలో మొత్తం 76,900 మందికిగాను మొదటి రోజు 3237 మంది పిల్లలకు టీకా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రెండో రోజు 11,560 మంది, మూడో రోజు 11977 , నాల్గో రోజు 8691, ఐదో రోజు 3887, ఆరో రోజు 3331, ఏడో రోజు 1525, ఎనిమిదో రోజు 1719, తొమ్మిదో రోజు 1092, పదోరోజు 648, 11వ రోజు 511, 12వ రోజు 159, 13వ రోజు 445 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వివరించారు. మొత్తం 48,772 మందికి టీకా ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.