బండ్లగూడ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని హంగులతో తీర్చిదిద్దల వలసిన భాద్యత ప్రతి కార్పొరేటర్పై ఉందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బుధవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మహేందర్గౌడ్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా కార్పొరేషన్ పరిధిలో 23 కోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని ఆయన అన్నారు. బీజేఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు.
నిత్యం ప్రజల మద్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.అన్ని డివిజన్లలో రోడ్డు, అండర్గ్రౌండ్ డైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేసి మిగత కార్పొరేషన్లకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి, కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.