చంపాపేట : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. అభివృద్ది కార్యక్రమాల్లో బాగంగానే బుధవారం చంపాపేట డివిజన్ పరిధిలోని సామ గౌరరెడ్డి కాలనీలో రూ.79 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ మదుసూదన్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. డివిజన్లోని మారుతినగర్ కాలనీలో రూ.4కోట్ల 20లక్షల వ్యయంతో భూగర్భడ్రైనేజీ పనులను ఒక్క వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అంతే కాకుండా వర్షాల కారణంగా తరుచు ముంపునకు గురవుతున్న సామ సరస్వతి కాలనీ, ఉదయ్నగర్ కాలనీ, పద్మనగర్ కాలనీ, మల్రెడ్డి రంగారెడ్డి నగర్ కాలనీల ముంపు సమస్య శాస్వత పరిష్కారం కొరకు రూ.39కోట్లు రాష్త్ర ప్రభుత్వం కేటాయించినట్లు ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ సుంకోజు కృష్ణమాచారి, పార్టీ స్థానిక నాయకులు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సామ మోహన్రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.