బొల్లారం : తిరుమలగిరి జేఎన్ఎన్యూఆర్ఎమ్ ఎల్ఐసీ భవనం వద్ద గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జేఎన్ఎన్ యూఆర్ఎమ్ ఇండ్లను లబ్దిదారులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఐదుగురు వ్యక్తులు హైటెన్షన్ టవర్ పవర్లైన్ పోల్స్ ఎక్కారు.
జేఎన్ఎన్యూఆర్ఎమ్ పథకం కింద ఇండ్లను అర్హులైన వారికే కేటాయించాలని లబ్దిదారులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఏండ్ల తరబడి ఇండ్ల కోసం వేచి చూస్తున్నామని తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తిరుమలగిరి మండల రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల కలుగజేసుకొని అర్హులైన వారికి ఇండ్లను కేటాయించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన కారులు కిందికి దిగారు.