మియాపూర్: గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల తెల్లాపూర్ల మధ్య నెలకొన్న డైనేజీ సమస్యను పరిష్కరించాలని తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ , కౌన్సిలర్లు విప్ ఆరెకపూడి గాంధీని కలిసి విన్నవించారు. ఈ మేరకు వివేకానందనగర్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ ఏండ్ల తరబడిగా ఉన్న డైనేజీ ఔట్లెట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సరైన ఔట్ లెట్ లేకపోవటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు.
ప్రజా సౌకర్యం కోసం చైర్మన్ సహా కౌన్సిలర్లు ముందుకు రావటం అభినందనీయమని విప్ గాంధీ పేర్కొన్నారు. సమస్యను తక్షణమే ఫోన్ ద్వారా అధికారులకు తెలిపిన విప్ గాంధీ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి, కౌన్సిలర్లు బాబ్జి లచ్చిరాం, శ్రీశైలం, నాగరాజు, శ్రీకాంత్, సొసైటీ సభ్యులు నారాయణరెడ్డి, దాసు తదితరులు పాల్గొన్నారు.