బొడ్రాయిబజార్ : ముగ్గులు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింపజేస్తాయని కౌన్సిలర్ గండూరి పావనీకృపాకర్, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్రావు అన్నారు. పట్టణంలోని విద్యానగర్లో పద్మశాలీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతి ప్రదానం చేసి మాట్లాడారు. సంఘం జిల్లా కన్వీనర్ మిట్టకోల యుగేంధర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్, కునుకుంట్ల శారదాదేవి, మార్యాల అరుణభారతి, పెండెం వాని, పిశిక వీరయ్య, మిర్యాల గోపాల కిషన్, పున్న వెంకన్న, కొంగరి ఉపేందర్ పాల్గొన్నారు.
గరిడేపల్లి : మండలంలోని రామచంద్రాపురం, సర్వారం గ్రామాల్లో మహిళలకు ఎఫ్ఎంసీ కంపెనీ ముగ్గుల పోటీలు నిర్వహించింది. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. సర్పంచులు బి.సుధీర్, కె.నాగిరెడ్డి, సర్వారం ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి సుమిత్ర, ఎస్ఎంసీ ప్రతినిధులు శ్రీనివాస్, పాపారావు, అశోక్, ప్రసాద్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
బాల భవన్లో విద్యార్థులకు..
సూర్యాపేట అర్బన్ : జిల్లా కేంద్రంలోని బాల భవన్లో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల భవన్ అభివృద్ధి కమిటీ సభ్యుడు కక్కిరేని మోహన్ హజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రాధాకృష్ణారెడ్డి, పుల్లయ్య, సత్యం, ఉమా, సత్యనారాయణ, అనిల్, సాయి, చరణ్, వీరునాయుడు పాల్గొన్నారు.
వేణుగోపాలపురంలో..
నడిగూడెం : మండలంలోని వేణుగోపాలపురంలో ఎఫ్ఎంసీ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు రంగురంగులతో రంగవల్లులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ఆకట్టుకున్నాయి. ఆకర్షణీయంగా ముగ్గులు వేసిన వారికి బహుమతులు అందజేశారు. సర్పంచ్ గందమళ్ల స్వరూపావెంకన్న, ఎఫ్ఎంసీ ప్రతినిధి ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.
కోదాడటౌన్ : సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీడీఓ విజయశ్రీ అన్నారు. పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో జయవరపు పరమేశ్వరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను ఆమె ప్రారంభించారు. వార్డు కౌన్సిలర్ కట్టెబోయిన జ్యోతీశ్రీనివాస్ యాదవ్, చిలుకూరు వైస్ ఎంపీపీ జనపనేని జానకి, కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ, టీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణాధ్యక్షురాలు ఇర్ల రోజారమణి, నూనె సులోచన, చందా నిర్మలా నాగిరెడ్డి పాల్గొన్నారు.
15న ముగ్గుల పోటీలు
చిలుకూరు, జనవరి12 : సంక్రాంతి సందర్భంగా మండల కేంద్రంలో ఈ నెల 15న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించకనున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొండా సైదయ్య తెలిపారు. బుధవారం స్థానికంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. సమావేశంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దొడ్డా సురేశ్బాబు, మండల ప్రధాన కార్యదర్శి నలబోలు శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, మాజీ జడ్పీటీసీ శివాజీనాయక్, డీఎల్డీఏ డైరెక్టర్ కస్తూరి నర్సయ్య, పీఏసీఎస్ చైర్మన్ అల్సకాని జనార్దన్, పాషా పాల్గొన్నారు.