రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పేదల బాధలెరిగిన నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ అండగా నిలుస్తున్నారని తెలిపారు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంతగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో శనివారం
రూ.50లక్షల సీఆర్ఎంఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి
మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఆకలిని పారదోలి అందరి ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఏడేండ్లలోనే అద్భుత ప్రగతిని సాధించుకుని, నేడు సగర్వంగా జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన రాష్ర్టానికి స్వర్ణయుగమన్నారు. అంతకుముందు దురాజ్పల్లి శివారులోని ఆరెకరాల్లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో అకాడమీకి ఆయన భూమిపూజ చేశారు. 150 మంది క్రీడాకారులు ఏకకాలంలో బస, ప్రాక్టీస్ చేసుకునేలా స్టేడియం నిర్మాణం జరుగుతుందని చెప్పారు.
సూర్యాపేట టౌన్/చివ్వెంల అక్టోబర్ 9 : పార్టీలకతీతంగా అన్ని రంగాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 80 మందికి రూ. 50 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు ఎన్నో చూశామని.. పోరాడి సాధించిన తెలంగాణలో వాటిని పూర్తిగా రూపుమాపుకున్నామని అన్నా రు. ఏడేండ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించుకున్నామని.. దీంతో నేడు ప్రజలు గర్వంగా జీవనం సాగిస్తున్నారని చెప్పారు.
క్రికెట్ అకాడమీ ప్రారంభం
చివ్వెంల మండలం దురాజ్పల్లి శివారులో ఆరు ఎకరాల స్థలంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్మించనున్న క్రికెట్ అకాడమీకి శనివారం మంత్రి జగదీశ్రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆటలు శారీరక, మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని, జీవితానికి తొలిమెట్టులా క్రీడలు దోహద పడతాయన్నారు. ఇక్కడ నిర్మించనున్న అకాడమీలో 150 మంది క్రీడాకారులు ఏకకాలంలో బసచేయడంతోపాటు ప్రాక్టీస్ చేసుకునేలా నిర్మాణం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీలు బీరవోలు రవీందర్రెడ్డి, నెమ్మాది భిక్షం, కుమారిబాబు, జడ్పీటీసీలు జీడి భిక్షం, మామిడి అనితాఅంజయ్య, సంజీవనాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలిలా ఆనంద్, టీఆర్ఏస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, వైస్ ఏంపీపీ జూలకంటి జీవన్రెడ్డి, క్యాట్ రాష్ట్ర కార్యదర్శి సునీల్బాబు, కౌన్సిలర్లు బాషా, లక్ష్మి, లవకుశ, అభినయ్, రాజేశ్, రాజేందర్రెడ్డి, డ్హక్ కమిటీ సభ్యులు రామగిరి నగేశ్, కీసర వేణు గోపాల్ రెడ్డి, వేమారెడ్డి, పాల్గొన్నారు.