భువనేశ్వర్: స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ దుమ్మురేపడంతో భారత ఫుట్బాల్ జట్టు ఇంటర్నేషనల్ కప్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో భారత్ 2-0తో లెబనాన్ను మట్టికరిపించి రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది.
భారత్ తరఫున కెప్టెన్ ఛెత్రీ (46వ నిమిషంలో), లాలిన్జులా (66వ ని.లో) చెరో గోల్ సాధించారు. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో తొలి అర్ధభాగంలో గోల్ నమోదు కాకపోగా.. ద్వితీయార్ధం ప్రారంభంలోనే 38 ఏండ్ల ఛెత్రీ అద్వితీయ గోల్తో భారత ఖాతా తెరిచాడు. అదే జోరు కొనసాగించిన మనవాళ్లు మరో గోల్ చేసి.. ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా విజయం సాధించారు.