ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ పూర్వస్థితికి చేరే దిశగా ప్రజారవాణా సంస్థ (ఆర్టీసీ) టాప్గేర్లో దూసుకెళ్తున్నది. కరోనా కష్టకాలంలో సంస్థకు నష్టం వచ్చినా.. ప్రయాణికుల భద్రత బాధ్యతగా తీసుకొని బస్సులు నడిపి భేష్ అనిపించుకుంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి బస్సుస్టేషన్లు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో జనం సొంతూర్లకు చేరుకుంటుండడంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉత్తమ సేవలు అందించడం, లాభాలే లక్ష్యంగా ఆర్టీసీ 56 అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఆర్టీసీ పనిచేస్తుండగా.. ఇది సత్ఫలితాలనిస్తున్నది. సిద్దిపేట జిల్లాలో మొత్తం 262 బస్సులు తిరుగుతున్నాయి. కార్గో ద్వారా రోజుకు రూ.26 వేలపైనే ఆదాయం వస్తున్నది. ప్రయాణికుల ద్వారా రోజుకు రూ.32 లక్షల ఆదాయం సమకూరుతున్నది.
సిద్దిపేట టౌన్, అక్టోబర్ 14 : ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ ప్రజారవాణా సంస్థ (ఆర్టీసీ) వారి విశ్వాసాన్ని చూరగొంది. పూర్వస్థితికి చేరే దిశగా టాప్గేర్లో దూసుకెళ్తున్నది. కరోనా కష్టకాలంలో సంస్థకు నష్టం వచ్చినా.. ప్రయాణికుల భద్రత బాధ్యతగా తీసుకొని బస్సులు నడిపి భేష్ అనిపించుకుంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి బస్స్టేషన్లు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. ప్రజలు బస్సుల్లో ప్రయాణించేందుకు ముందుకు వస్తున్నారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఉన్న బస్సు డిపోల్లోని బస్సులు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి.
కరోనా కాలంలో కోల్పోయిన ఆదాయాన్ని ప్రజారవాణా సమకూర్చుకుంటున్నది. ఇందుకు గాను 56 అంశాలను ప్రామాణికంగా తీసుకొని ప్రణాళిక రూపకల్పన చేసింది. జనాభా శాతాన్ని కొలమానంగా తీసుకొని అందుకు తగ్గట్టుగానే బస్సు సేవలు నడుపుతున్నది. ఇప్పటికే ప్రణాళికలు అమలుపరుస్తున్నది. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాకలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. మొ త్తం 262 బస్సులు అన్ని రూట్లలో తిరుగుతున్నాయి. రెండు దఫాలుగా ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సమయం లో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయి సామర్థ్యంతో బస్సులు నడుస్తున్నాయి. ఆర్టీసీ ఆదాయాన్ని సమకూర్చుకుంటూ ముందుకు వెళ్తున్నది.
ప్రణాళికలు అమలు ..
సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన ఆర్టీసీ ప్రయాణికుల చెంతకు వెళ్లి ఉత్తమ సేవలందిస్తున్నది. ఆర్టీసీ యథాస్థితికి చేరేందుకు 56 అంశాలను రూపొందించి అమలుపరుస్తున్నది. అందులో ప్రధానంగా చెయ్యెత్తిన చోట బస్సు ఆపడం, ఏ ఒక్క ప్రయాణికుడిని వదలకుండా బస్సును ఎక్కించడం, మారుమూల ప్రాంతాలకు బస్సు సేవలు పునరుద్ధరించడం, 30 మంది ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా బస్సును కేటాయించడం, సమయానుకూలంగా బస్సులు నడపడం, ఎప్పటికప్పుడు ఆర్టీసీ
పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలిసేలా అందు
బాటులో ఉంచడం, కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి ట్రిప్పుకు బస్సులను శానిటైజేషన్ చేయడం, ఆదాయాన్ని తీసుకొచ్చే కండక్టర్లకు ప్రోత్సాహం ఇవ్వడం, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తు లాభాల బాట పట్టేందుకు నిరంతరాయంగా కృషిచేస్తున్నది.
పెరిగిన ఆదాయం..
సిద్దిపేట జిల్లాలో 262 బస్సులు ఉన్నాయి. సిద్దిపేట డిపో పరిధిలో లాక్డౌన్ రోజుల్లో ఆదాయం రూ.3 లక్షలకు పైగా రాగా.. ప్రస్తుతం రూ.13 లక్షలకు పైగా ఆదాయాన్ని గడిస్తున్నది. గజ్వేల్ డిపో పరిధిలో రూ.7 లక్షలకు పైగా ఆదా యం సమకూరుతుండగా, కరోనా సమయంలో కేవలం రూ.2 లక్షలకు పైగానే ఆదాయం వచ్చింది. హుస్నాబాద్ డిపో పరిధిలో గతంలో రూ.2 లక్షల ఆదాయం రాగా.. ప్రస్తుతం రూ.6 లక్షల పై చిలుకు ఆదాయం వస్తున్నది. దుబ్బాక డిపో పరిధిలో రూ.5 లక్షల ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. ఇలా సుమారు. రూ.32 లక్షల ఆదాయాన్ని ప్రజారవాణా రాబట్టుకుంటున్నది. దీనికి తోడు కార్గో ఆదాయం మెరుగ్గా వస్తుండడంతో ఆర్టీసీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాసులు కురిపిస్తున్న కార్గో..
ఆర్టీసీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. ఆదాయాన్ని సమకూర్చే కార్గో బస్సు సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా కార్గో సేవలు విస్తృతంగా అమలవుతున్నాయి. దీంతో ప్రజారవాణాకు కాసుల వర్షం కురుస్తున్నది. సరుకులు ఒకచోట నుంచి మరోచోటుకు చేరవేస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్లో కార్గో బస్సుసేవలు అందుతున్నాయి. రోజుకు రూ.26 వేల పైనే ఆదాయం కార్గో ద్వారా వస్తున్నది. సిద్దిపేట జిల్లాలో కార్గో ద్వారా నెలకు రూ.8 లక్షలకు పైగా ఆదాయం ఆర్టీసీకి సమకూరుతున్నది.
ప్రయాణికులకు మరింత చేరువవుతున్నాం..
కరోనా కష్టకాలం నుంచి ప్రజారవాణా ఇప్పుడిప్పుడే యథాస్థితికి చేరుకుంటున్నది. ప్రయాణికులను సురక్షితంగా, భద్రంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కొవిడ్ నిబంధనలు అమలుపర్చుతున్నాం. ప్రయాణికులు బయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ట్రిప్పునకు శానిటైజేషన్ చేస్తున్నాం. ఆదాయ మార్గం పెంచేందుకు 56 రకాల ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రయాణికుల చెంతకు వెళ్లి సేవలందిస్తున్నాం.
చిన్నప్పటి నుంచి బస్సులో ప్రయాణించడమే అలవాటు. ప్రైవేటు వా హనాలు ఎన్ని ఉన్నా బస్సు ప్రయాణమే సురక్షితం. భద్రతకు, భరోసాకు ఆర్టీసీ మారుపేరుగా నిలుస్తున్నది. చెయ్యెత్తిన చోట ఆపుతూ మెరుగైన సేవలు అందిస్తున్నారు. గతంలో కలంటే ఇప్పుడు ఆర్టీసీ సేవలు బాగున్నాయి.