బేగంపేట్ : టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సమాచార ప్రసారాల వ్యవహారాల కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభకులు జోగినపల్లి సంతోష్కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
ఈ సంధర్భంగా బేగంపేట్ దేవనార్ ఆంధుల పాఠశాలలో టీఆర్ఎస్ యువ నాయకుడు అశీష్కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను జోగినపల్లి సంతోష్కుమార్ కట్చేసి విద్యార్ధులకు కేక్ తినిపించి వారితో కాసేపు సరదాగా గడిపారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్రావు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.