తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో భూముల విలువలు పెరిగాయి. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో ‘రియల్’ జోరు పెరిగింది. పలు ప్రాంతాల మీదుగా రీజినల్ రింగ్రోడ్డు వెళ్తుండటంతో పెద్ద ఎత్తున వెంచర్లు వెలిశాయి. దీంతో ప్లాట్ల క్రయవిక్రయాలు జోరుగా సాగుతుండడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. గడిచిన సంవత్సరం పలు కారణాల వల్ల ఆదాయం తగ్గినా, ఈ ఏడాది రూ.1090 కోట్ల ఆదాయం స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఖజానాకు వచ్చి చేరింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.200 కోట్లకుపైగా రెవెన్యూ రావడం గమనార్హం. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 94,945 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి రూ.345 కోట్ల రాబడి వచ్చింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు అప్పగించిన విషయం తెలిసిందే. కేవలం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల బాధ్యతను మాత్రమే సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించినా రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం తగ్గలేదనే చెప్పవచ్చు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజి స్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు గతేడాదికి మించి రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ ఖజానాకు వచ్చి చేరింది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్ర యాలతో రూ.1090 కోట్ల ఆదాయం జిల్లా స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల శాఖ ఖజానాలో జమ అయ్యింది. అత్యధికంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారానే అధిక ఆదాయం సమకూరింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు భారీగానే ఆదాయం వచ్చినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాది ఆగస్టు వరకు వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు రూ.200 కోట్లకుపైగా రెవెన్యూ అధికంగా రావడం గమనార్హం. గతేడాది ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకుగాను సుమారు నాలుగు నెలలపాటు రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేయడం, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు తాసిల్దార్లకు అప్పగించడం, కరోనా వైరస్ వంటి కారణాలతో గత ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల వరకు రెవెన్యూ తగ్గింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పుంజుకుంది. ఉమ్మడి జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో రియల్ వ్యాపారం జోరందు కుంది. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ నియోజకవర్గాల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్రోడ్డు వెళ్తుండడంతో చేవెళ్ల నియోజక వర్గం లోని చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, షాద్నగర్ నియోజకవర్గంలోని షాద్నగర్, తదితర ప్రాం తాలు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్ వరకు పెద్ద ఎత్తున వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఏర్పాటు చేసిన వెంచర్లలోనూ అధిక మొత్తంలో ప్లాట్ల క్రయవి క్రయాలు జరుగుతున్నాయి. దీంతో గత రెండు, మూడు నెలలుగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆదాయం పెరిగింది.
రూ.1090 కోట్ల ఆదాయం…
జిల్లాలోని వ్యవసాయేతర భూముల క్రయ విక్రయాల ద్వారా జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు రూ.1090 కోట్ల రెవె న్యూ వచ్చింది. అత్యధికంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా ఇప్పటివరకు రూ.345 కోట్ల రాబడి చేకూరింది. అదేవిధంగా జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అత్యధికంగా రెవె న్యూ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం అనంతరం గండిపేట్, శేరిలిగంపల్లి, మహేశ్వరం సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల్లో అధిక రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరింది. అయితే జిల్లావ్యాప్తంగా ఏప్రి ల్ నుంచి ఆగస్టు వరకు 94,945 డాక్యు మెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది.అదేవిధంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను పూర్తిగా ఆయా మండలాల తాసిల్దార్లకు అప్పగించడం, కేవలం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు మాత్రమే సబ్ రిజిస్ట్రార్లకు బాధ్యతలున్నప్పటికీ రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం మాత్రం తగ్గలేదనే చెప్పవచ్చు. ఉమ్మ డి రంగారెడ్డి జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ఆగస్టు నెలలో ప్రభుత్వ ఖజానాకు చేరిన ఆదాయాన్ని పరిశీలిస్తే,…కొడంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.7.87 లక్షలు, షాద్నగర్ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.14.18 కోట్లు, ఫారూఖ్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.5.72 కోట్లు, చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.5.32 కోట్లు, హయ త్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.4.08 కోట్లు, ఇబ్రహీంప ట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ. 4.51 కోట్లు, పరిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.39.35 లక్షలు, తాండూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.1.03 కోట్లు, వికారాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.1.78 కోట్లు, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.73.95 కోట్లు, సరూర్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.8.16 కోట్లు, చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ. 6.74 కోట్లు, పెద్దఅంబర్పేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.3.01 కోట్లు, రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.14.74 కోట్లు, మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.14.22 కోట్లు, శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ. 4.41 కోట్లు, శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యా లయం ద్వారా రూ.22.49 కోట్లు, శంకర్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.8.54 కోట్లు, గండీపేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.51.41 కోట్లు, ఎల్బీనగర్ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.10.99కోట్లు, వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.5.55 కోట్లు, అబ్దుల్లాపూర్మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.2.38 కోట్ల రెవెన్యూ జిల్లా స్టాం పు లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఖజనాలో జమ అయ్యింది.
ఇప్పటివరకు 94,945 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్…
జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్ప టివరకు 94,945 డాక్యుమెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అత్య ధిక డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యింది. అయితే ఆగస్టు నెలలో ఆయా సబ్రిజిస్ట్రార్ కా ర్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తైన డాక్యు మెం ట్లకు సంబంధించి,…కొడంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 77 డాక్యుమెంట్లు, షాద్నగర్లో 667, ఫారూఖ్నగర్లో 1406, చేవెళ్లలో 785, హయత్నగర్లో 534, ఇబ్రహీంపట్నం లో 1418, పరిగిలో 186, తాండూర్లో 549, వికారాబాద్లో 523, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో 1947, సరూర్నగర్ 615, చం పాపేట్లో 1154, పెద్దఅంబర్పేట్ 881, రాజేం ద్రనగర్లో 888, మహేశ్వరంలో 1908, శంషాబాద్లో 712, శేరిలింగంపల్లిలో 926, శంకర్పల్లిలో 595, గండీపేట్లో 1427, ఎల్బీనగర్లో 965, వనస్థలిపురంలో 923, అబ్దుల్లాపూర్మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 616 డాక్యుమెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
గత ఐదు నెలల్లో వచ్చిన రెవెన్యూ….
నెల డాక్యుమెంట్లు రెవెన్యూ
ఏప్రిల్ 23,161 197 కోట్లు
మే 4906 383 కోట్లు
జూన్ 19,682 212 కోట్లు
జులై 27,494 376 కోట్లు
ఆగస్టు 19,702 263 కోట్లు
మొత్తం 94,945 1090 కోట్లు