నీటి సౌకర్యం ఉంటే పచ్చిమేత సాగు చేసుకోవాలి
వరిగడ్డిని నిల్వ చేసి పశువులకు మేతగా వేయాలి
సలహాలు పాటించాలంటున్న పశువైద్యాధికారులు
షాబాద్, ఏప్రిల్ 4: వేసవికాలంలో పశువులకు మేత దొరకక రైతులు ఇబ్బందులు పడకుండా పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ముందు జాగ్రత చర్యలు పాటిస్తే మేలు. ఇలాంటి సమయంలో బోరుబావుల వద్ద నీటి వసతి ఉన్నవారు తమకున్న భూమిలో కొంత భాగాన్ని పచ్చిమేతల సాగుకు కేటాయించడం అవసరమని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. పశుగ్రాసం రుచికరంగా ఉండాలి. పశువులకు ఏ మాత్రం హాని కలిగించ కుండా సులభంగా జీర్ణమయ్యేదిలా ఉండే బాగుంటుంది. తక్కువ ఎరువు తో తక్కువ కాలంలో అధిక దిగుబడి ఇచ్చేదిగా ఉండాలి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు వచ్చేలా చూసుకోవాలి. సరైన యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే పశుగ్రాసంలో మంచి దిగుబడులు వస్తాయి.
ధాన్యపు జాతి పచ్చిమేతలు…
ఇవి జొన్న జాతికి చెందినవి. మండలంలోని కుమ్మరిగూడ, నాగర కుంట, నరెడ్లగూడ, అస్పల్లిగూడ, అంతారం, కేశారం గ్రామాల్లో ధాన్యపు జాతి పశుగ్రాసం అత్యధికంగా పెంచుతున్నారు. వీటిలో పిండి పదార్థాలు ఎక్కు వగా ఉంటాయి. ఒక ఏడాదిలోనే ఈ పంట కాలం పూర్తవు తుంది. నేపి యర్, యన్బీ-21,కో-1,3,పారా గడ్డి, గినీగడ్డి అనేవి బహు వార్షికాలు. అంటే ఒకసారి నాటితే మూడు సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. కాయజాతి పచ్చిమేతలు పశువులకు మంచి బలాన్ని ఇస్తాయి. కాయజాతి పచ్చిమేతల్లో అలసంద, లూసర్న్, బర్సీమ్, జనుము అనేవి బహువార్షిక కాయజాతి పశుగ్రాసం. రైతులు వ్యవసాయాధికారుల సలహా లు తీసుకుని తమకు అనువైన పచ్చిమేతల్ని సాగు చేసుకోవాలి. పశుగ్రాసాలు ఏడాది పొడవునా ఒకేలా పెరగవు. కానీ పశువులకు ఏడాది పొడవునా పశుగ్రాసం అవసరం ఒకేలా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో సాగు చేసిన పశు గ్రాసా న్ని శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకోవాలి.
వరిగడ్డిని ఇలా నిల్వచేయాలి…
వరిగడ్డిని నిల్వ చేయాలంటే ముందుగా 60 లీటర్ల నీటిలో నాలుగు కిలోల యూరియాను కరిగించాలి. వంద కిలోల వరిగడ్డిని నేలమీద పరిచి దానిపై యూరియా ద్రావణాన్ని చల్లి బాగా కలిసేలా చూడాలి. ఈ విధంగా సు పోషకం చేసిన తరువాత ఖాళీ సంచుల్లో గట్టిగా నింపాలి. గాలి చొర బడ కుండా కుట్టి వారం రోజుల పాటు మాగనివ్వాలి. అ తరువాత దానిని పశు వులకు తినిపించాలి. దీంతో తేమ శాతం పెరిగి గడ్డి రుచిగా, మెత్తగా ఉం టుంది. పశువులు ఇష్టంగా తింటాయి. ఒక రోజులో పశువుకు ఆరు కిలో ల వరకు మాగేసిన గడ్డిని అందించవచ్చు. పశుగ్రాసం వృథా కాకుండా ఉం డాలంటే దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పశువులకు తినిపించాలి.
పొదుపుగా వాడుకోవాలి
ప్రస్తుతం ఎండలు అధికంగా ఉండడంతో పశువు లకు బయట మేత దొర కడం కష్టంగా మారింది. అందుకోసం రైతులు పశుగ్రాసాన్ని పొదుపుగా వాడుకోవాలి. బోరుబావుల వద్ద నీటి సదుపాయం ఉన్న రైతులు పచ్చి మేతను సాగు చేసుకోవాలి. మిగతా రైతులు వరిగడ్డిని నిల్వ ఉంచుకుని మక్కిన తర్వాత పశువులకు మేతకు ఉపయోగించాలి. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు కావాల్సిన సలహాలు, సూచనలు రైతులకు ఎప్పకప్పుడూ అందజేస్తున్నాం.
డాక్టర్ స్రవంతి, పశువైద్యాధికారి, షాబాద్