ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు
జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు
నివాళులర్పించిన కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ్రప్రజాప్రతినిధులు
తెలంగాణచౌక్, ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా, నగరంలోని కోతిరాంపూర్లో గల ఫూలే విగ్రహానికి ఎమ్మెల్సీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే అని కొనియాడారు. అలాగే, ఫూలే విగ్రహానికి కలెక్టర్ శశాంక, మున్సిపల్ కమిషనర్ క్రాంతి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, కుల, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు ఫూలే అని కొనియాడారు. బీసీ సంక్షేమాధికారి రాజామనోహర్రావు, 9వ డివిజన్ కార్పొరేటర్ ఐలేందర్యాదవ్, బీసీ సంఘం నాయకులు శ్రీధర్రాజు, ఆర్ సత్యనారాయణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఫూలే విగ్రహానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు కొయ్యడ సృజన్కుమార్, సదాశివ, మణికంఠ, రమేశ్, శేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, ఏప్రిల్ 11: కోతిరాంపూర్లోని ఫూలే విగ్రహానికి అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. నగరంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పార్కులో ఫూలే చిత్రపటానికి కుల సంఘాల జేఏసీ చైర్మన్ జీఎస్ ఆనంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్లు మహేశ్, రమణారావు, గిద్దెపెరుమాండ్ల ఆలయ చైర్మన్ కలర్ సత్తన్న, కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు రాధారావు, గౌడ సంఘం నాయకుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని బీసీ సంఘ కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాశ్, జిల్లా కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు కిరణ్, అరుణ్, రాజు, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, గాయత్రీనగర్ యూత్ నాయకులు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్ మహ్మద్ శర్ఫొద్దీన్, వేణుగోపాల్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్లో ఫూలే చిత్రపటానికి ఆర్ఎం శ్రీధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే అని కొనియాడారు. డీవీఎం రవిశంకర్రెడ్డి, డిపో మేనేజర్లు అర్పిత, మల్లేశం, పర్సనల్ ఆఫీసర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్, ఏప్రిల్ 11: నాగార్జునసాగర్లో ఫూలే చిత్రపటానికి మేయర్ వై సునీల్రావు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో సామాజిక అసమానతలను తొలగించేందుకు ఫూలే ఎంతో కృషి చేశారని కొనియాడారు. అలాగే, కోతిరాంపూర్లోని ఫూలే విగ్రహానికి డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల్లో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
విద్యానగర్, ఏప్రిల్ 11 : శాతవాహన యూనివర్సిటీ చౌరస్తాలోని ఫూలే విగ్రహానికి 19వ డివిజన్ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యతోనే చైతన్యం వస్తుందని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సూచించిన గొప్ప వ్యక్తి ఫూలే అని కొనియాడారు. అలాగే, ఫూలే విగ్రహానికి బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నం ప్రకాశ్, మంతెన కిరణ్, దిండిగాల మధు, పొన్నాల రాము, పాశం నర్సింహారెడ్డి, సరోత్తంరెడ్డి, కందుకూరి వెంకట్, కలికోట మోహన్, మాడిశెట్టి సుబ్రహ్మణ్యం, రమేశ్, సుమన్, రవిగోపాల్, రాకేశ్, శివ, భూమేశ్ పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఏప్రిల్ 11: నగరంలోని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయ ఆవరణలో ఫూలే చిత్రపటానికి ఎస్ఈ మాధవరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అధికారులు రాంచందర్రావు, ఈశ్వర్ప్రసాద్, బీసీ నాయకులు సత్యనారాయణ, జనార్దన్, ఆర్ వెంకటేశ్వరరావు, మునీందర్, వెంకట్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి
అప్పుడే ఏం చేయలేదు.. ఇప్పుడేం చేస్తారు జానారెడ్డి ?