హిమాయత్నగర్ : దేశ వ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రాన్ని అందజేసింది.
శుక్ర వారం హిమాయత్నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్గౌడ్ మాట్లాడుతూ దేశంలో కుల గణనను చేపట్టి సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి, వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభ,శాసనమండలిలో తీర్మానం చేసి ఆమోదించిందని తెలిపారు.
యాబై శాతం పరిమితి కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఓబీసీలకు రాష్ట్ర ప్రభుత్వాలు 27 శాతం రిజరేషన్లను అందించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.బీసీల జనగణన చేసి జనాభా దామాషా ప్రకారం వారి అభివృద్ధి,సంక్షేమానికి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎంపీ కె.కేశవరావు సానుకూలంగా స్పందించి బీసీ కుల గణన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ఒత్తిడి తీసుకువస్తామని చేప్పారని నరేందర్గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేష్చారి, నాయకులు అశోక్గౌడ్, లింగమూర్తి పటేల్, ప్రశాంత్ యాదవ్, నాగరాజు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.