శంషాబాద్ రూరల్: మండలంలోని పాలమాకుల గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు పొచయ్యకు ఉత్తమ పంచాయతీ సిబ్బందిగా పారిశుద్ధ్య విభాగంలో అవార్డు దక్కింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, డీఎల్పీవో అన్నపూర్ణ, ఎంపీడీవో వినయ్కుమార్, పాలమాకుల గ్రామ సర్పంచ్ సుష్మాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.సర్పంచ్ సుష్మాగౌడ్ మాట్లాడుతూ పాలమాకుల గ్రామ పారిశుద్ధ్య కార్మికుడు పోచయ్యను ఉత్తమ సిబ్బందిగా గుర్తించిన జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.