మాదన్నపేట:కుర్మగూడ డివిజన్ మాదన్నపేట శ్రీమధుర సన్నమ్మ,దుర్గాదేవి దేవాలయంలో విగ్రహా ప్రతిష్ఠాపన తర్వాత నిర్వహించే శాంతి పూజ కార్యక్రమం దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మాదన్నపేట రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అమ్మవార్లకు పంచలోహా కిరీటాలు సమర్పించారు. ఉదయం అమ్మవార్లను సుందరంగా అలంకరించి హోమం, ప్రత్యేక పూజలు చేసి, అన్నదానం నిర్వహించారు. నగర ఓబీసి ఉపాధ్యక్షుడు తంగెళ్ల సుధీర్ పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు దివిటి శేఖర్, ధరమ్, ప్రకాష్, తత్తరి యాదగిరి, సందీప్, సన్ని, అనిల్, గజ్జి వినోద్, పెద్ది అరుణ నాయకులు పుప్పాల శ్రీనాథ్ పాల్గొన్నారు.