ఎదులాపురం, మే 13 : నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మావల పరిధి కేఆర్కే కాలనీలో ఉదయం 5 గంటలకు 100 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. రూ.6వేల విలువైన గుట్కా ప్యాకెట్లు, 58 బైక్లు, 22 ఆటోలు, లారీ, మ్యాక్స్పిక్ అప్ను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విక్రేతలపై మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని డీఎస్పీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. కార్డన్ సెర్చ్లో రూరల్ సీఐ బీ రఘుపతి, జైనథ్ సీఐ కే నరేశ్ కుమార్, ఎస్ఐలు ఏ హరిబాబు, విష్ణువర్ధన్, విష్ణుప్రకాశ్, రాధిక, ప్రవళిక, సబ్ డివిజనల్ పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.