ఆయిల్పామ్ సాగుపై జిల్లా రైతాంగం ఆసక్తి చూపుతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, లాభాలు తెచ్చే పంటలు పండించడంపై దృష్టి సారిస్తున్నది. మూడేండ్లు శ్రమిస్తే 30 ఏండ్ల పాటు ఆదాయాన్నిచ్చే ఆయిల్పామ్ సాగు వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులను మళ్లిస్తోంది. పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువగా ఉండడం, ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో రైతులు ఉత్సాహం చూపుతున్నారు. సంప్రదాయ పంటల సాగుతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు.
చేస్తే ఇలాంటి సమస్యలు ఉండవని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మూడేండ్ల పాటు మొక్కలను జాగ్రత్తగా పెంచితే 30 ఏండ్ల వరకూ ఏటా ఎకరానికి రూ.2 లక్షల ఆదాయం పొందవచ్చని పేర్కొంటున్నారు. మొదటి మూడేండ్లు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తున్నది. అంతేకాకుండా ఆయిల్పామ్ వేసిన భూముల్లో అంతర పంటలు పండిస్తూ అధిక ఆదాయం పొందవచ్చని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు ఆయిల్పామ్ సాగుకు మొగ్గు చూపుతున్నారు.
– ఆర్మూర్, మే 13
ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మంచి దిగుబడితో పాటు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉండడంతో రైతులు ఆ పంట వేసేలా ప్రోత్సాహకా లు అందిస్తున్నది. దీర్ఘకాల ఆదాయం లభించనుండడంతో ఆయిల్పామ్ సాగు వైపు రైతు లు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొం దే అవకాశం ఉండడంతో ఆ పంట వైపు మళ్లుతున్నారు. పంట మార్పిడి విధానం కింద ఆయిల్పామ్ తోటలు సాగు చేసేందుకు జిల్లాలోని మెజార్టీ రైతులు ఆసక్తి చూపుతున్నారు. సంప్రదాయ పంటల వలే చీడపీడలకు గురి కాకుండా ఆయిల్పామ్ రైతులకు మంచి లా భాలను తెచ్చి పెడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
సాధారణంగా తక్కువ నీటి సదుపాయమున్న భూములతో పాటు నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లోనూ దీన్ని సాగు చేయవచ్చు. మొక్కలు నాటిన మూడేళ్ల తర్వాత దిగుబడులు వస్తాయి. ఏటా ఎకరానికి రెండు లక్షల రూపాయల చొప్పున దాదాపు 30 ఏండ్ల పాటు రైతులకు లాభాలను కురిపించే ఆయిల్పామ్ పంటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహాన్నందిస్తున్నది. మార్కెటింగ్ సౌకర్యంతో పాటు ఆయిల్పామ్ దిగుబడులు ప్రారంభమయ్యే మూడేళ్ల వరకు ఎకరానికి రూ.30 వేలకు పైగా సబ్సిడీని అందిస్తుంది.
వానకాలంలో పంటల సాగు, యాజమాన్య పద్ధతులపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతోపాటు పంట మార్పిడి విధానంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సంప్రదాయ పంటలు కాకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని సూచిస్తున్నారు. ఆయిల్పామ్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.30 వేలకు పైగా సబ్సిడీని ఇస్తుందని వివరిస్తున్నారు. దీంతో జిల్లా రైతులు ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు.
ఆయిల్పామ్ సాగు చేసే వారు అదనపు ఆదాయాన్ని పొందేందుకు మంచి అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆయిల్పామ్ మొక్కల మధ్యలో కూరగాయలు, మక్క, పల్లి, పత్తి, బొప్పాయి, సోయాబీన్, కొత్తిమీర, మెంతికూర వంటి పంటలను వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచిస్తున్నారు. ఆయిల్పామ్ మొక్కలు నాటిన నాలుగేండ్ల తర్వాత దిగుబడి వస్తుంది. అప్పటివరకు అంతర పంటలు పండిస్తూ ఆదాయం పొందవచ్చని పేర్కొంటున్నారు.
ఇందూరు జిల్లాలో క్రమంగా నూనె గింజల సాగు తగ్గుతూ వస్తుంది. పామాయిల్ వాడకం రోజురోజుకూ పెరుగుతున్నది. ఆయిల్పామ్ ఉత్పత్తులు జిల్లాలో ఇంతవరకు సాగుకు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి కష్టాలు తీరిపోయా యి. దీంతో రైతులు ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖ అధికారులు ఆయిల్పామ్ మొక్కలను అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో 16 ఎకరాల విస్తీర్ణంలో నర్సరీలను ఏర్పాటు చేసి 5.50 లక్షల ఆయిల్పామ్ మొక్కలను పెంచుతున్నారు. ఈ నర్సరీని ఇటీవల సందర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, రాష్ట్ర మార్క్ఫె డ్ చైర్మన్ మార గంగారెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రెడ్డి మొక్కల పెంపకాన్ని పరిశీలించారు.
సంప్రదాయ పంటలను మా ముందుతరాల వాళ్లు సాగు చేసిండ్రు. వారు పండించిన పంటలనే మేమూ పండిస్తున్నం. సీఎం కేసీఆర్, వ్యవసాయాధికారులు పంట మార్పిడి విధానాన్ని అలవర్చుకొని అధిక దిగుబడులు సాధించాలంటుండ్రు. సీఎం సార్ సూచనతో ఇకపై పంట మార్పిడి విధానం పాటిస్తాం. ఆయిల్పామ్ ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుందని అధికారులు చెబుతుండ్రు. మా ఏరియాలో అధికారుల సూచనతో ఆయిల్పామ్ సాగు చేస్తం.
– ఇట్టెడి హారికారెడ్డి, మహిళా రైతు, కోటార్మూర్
జిల్లాలో ఈ యేడాది రైతులతో సాగు చేయించేందుకు 5.50లక్షల పైచిలుకు ఆయిల్పామ్ మొక్కలను చేపూర్ నర్సరీలో పెంచుతు న్నం. జిల్లావ్యాప్తంగా ఆయిల్పామ్ సాగు కు రైతుల వద్ద నుంచి ఇదివరకే దరఖాస్తులు స్వీకరించాం. రైతులు చా లా ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే వారికి మొక్కలను అందించి నాటిస్తం. మొక్కలు నాటిన తర్వాత మూడు నుంచి నాలుగేండ్ల తర్వాత దిగుబడులు వస్తాయి. ఆయిల్పామ్ సాగులో నాలుగేండ్ల కన్నా ముందు అంతర పంటలు వేసుకొని రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
-సుమన్, ఉద్యానశాఖ అధికారి, ఆర్మూర్