హన్మకొండ చౌరస్తా, ఏప్రిల్ 5: నాయీ బ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్లవరకు ఉచిత విద్యుత్ అమలు కు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చిన సందర్భంగా హన్మకొండ చౌరస్తాలో నాయీబ్రాహ్మణులు, రజక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సెలూన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగవల్లి సురేశ్కుమార్ మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ అమలు చేసిన సీఎం కేసీఆర్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్కు కృతజ్ఞతలు తెలిపారు.
హన్మకొండలోని సెలూన్లలో పనిచేసే వారందరూ టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, రైతు రుణవిమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లాండ్రీ అసోసియేషన్ అధ్యక్షుడు పైండ్ల భిక్షపతి, రజక సంఘం సీనియర్ నాయకుడు ఎల్లయ్య, రాజు, నాయీబ్రాహ్మణులు తూముల సాంబయ్య, గజవలి తిరుపతి, నాగవల్లి కృష్ణ, సింగారపు శ్యాం, శ్రీరాముల నరేందర్, మొగిలిచర్ల ప్రసాద్, కామోజీ జగన్, నవీన్ పాల్గొన్నారు.
మడికొండలో..
మడికొండ: మడికొండ చౌరస్తాలో నాయీ బ్రాహ్మణులు, రజకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆవాల రాధికారెడ్డి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణు లు ఎలకంటి బాబు, ఎలకంటి భిక్షపతి, పైడిపాల రవీందర్, ఎలకంటి శ్రీను, రజకులు నార్లగిరి రమేశ్, పాండ్యాల మూర్తి, నార్లగిరి కుమారస్వామి, గంగారపు కుమార్, నార్లగిరి కుమార్, నార్లగిరి నాగరాజు పాల్గొన్నారు.
ఫాతిమానగర్లో..
కాజీపేట: ఫాతిమానగర్ చౌరస్తాలో పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్యాల భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రజకులు, నాయీబ్రాహ్మణులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారని తెలిపారు. సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కోశాధికారి సాంబరాజు అంకయ్య, పట్టణ అధ్యక్షుడు నాగెల్లి సమ్మయ్య, రాజు, మధు, రమేశ్, రుద్రక్ష, వెంకన్న, తిరుపతి, యాదగిరి, శ్యామ్ పాల్గొన్నారు.
57వ డివిజన్లో..
భీమారం: గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నంది శ్రీనివాస్, తోట నాగరాజు, సీహెచ్ చంద్రశేఖర్, మూల దేవేందర్, కత్తెరశాల ప్రశాంత్, భగవాన్రెడ్డి, గండ్రాతి రాంబాబు, లెనిన్, శ్రీను, నాయీబ్రాహ్మణులు దుబ్బకుల సూరయ్య, ప్రశాంత్, యాకయ్య, రమేశ్, నరేశ్, రాజు, సాయిరాం, క్రాంతి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఒంటికాలితో బెంగాల్ను.. రెండుకాళ్లతో ఢిల్లీని గెలుస్తా