అంబర్పేట : బాగ్అంబర్పేట డివిజన్లోని శాంతినగర్లో నిర్మిస్తున్న నూతన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి నాణ్యత లోపం లేకుండా రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం పక్కనే ఉన్న బస్తీల్లో పర్యటించి మంచినీటి సరఫరాలో లోఫ్రెషర్ సమస్య, కలుషిత నిటి సమస్యను తెలుసుకున్నారు. దీనికోసం విడిగా డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణం వంటి ఇతర పనులు కాలయాపన లేకుండా పూర్తి చేయాలని, అక్కడ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ రవి, వాటర్వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్ర మోహన్, పార్టీ నాయకులు కెంచె మహేష్, కోట్ల సంతోష్, దారయోబు, ధనుంజయ, రాజేష్, బస్తీవాసులు హేమంత్, శ్యామ్, స్వామి, యాదగిరి, కృష్ణ, కుర్మయ్య, కిరణ్, ప్రవీణ్,రాజశేఖర్, వెంకటయ్య, బాలకృష్ణ, సాయి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.