అబిడ్స్ : బజార్ఘాట్లోని బంగారు ముత్యాలమ్మ ఆలయ కమిటీ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ను ముద్రించిన ఆలయ కమిటీ ప్రతినిధులను మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు జెట్ట గోపాల్, బొద్దం అర్జున్ యాదవ్, లక్ష్మణ్రావు, విజయ్ యాదవ్, జాంబాగ్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు పి నరేందర్ యాదవ్లు పాల్గొన్నారు.