నిజామాబాద్ క్రైం, జనవరి 2 : పోలీసు శాఖలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. కేంద్రప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగానే అత్యుత్తమ సర్వీసులు అందజేసే పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం కొన్నేండ్లుగా అవార్డులను అందజేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డుల జాబితాలో నిజామాబాద్ జిల్లాకు చెందిన 20 మంది, కామారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురి పేర్లను వెల్లడించింది. జాబితాలో నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు, నాల్గో టౌన్ ఎస్సై జ్ఞాన్సింగ్ సర్దార్, సీసీఆర్బీ ఎస్సై జి.చాందయ్య, సి.శంకర్, బోధన్ రూరల్ ఏఎస్సై దత్తాద్రి, నాల్గో టౌన్ ఏఎస్సై సత్యానందం, ఏఆర్ అబ్దుల్ సలీముద్దీన్, రూరల్ ఏఆర్ ఎస్సై వెంకయ్య, ఏఆర్ ఎస్సై ఎండీ సలీముద్దీన్, ఏఆర్ ఎస్సై సత్యనారాయణ గౌడ్, వేల్పూర్ పోలీస్ స్టేషన్ ఏఆర్ ఎస్సై ఎం.యాదగిరి, ఏఆర్ ఎస్సై అబ్దుల్ బాసిత్, ఏఆర్ హెచ్సీ బి.గోపాలకృష్ణ, బోధన్ రూరల్ హెచ్సీ యు.వసంత్రావు, జక్రాన్పల్లి హెచ్సీ కె.అమరేందర్, డిచ్పల్లి హెచ్సీ డి.రమేశ్, నిజామాబాద్ రూరల్ హెచ్సీ కె.మోహన్, రెండో టౌన్ పీసీ ఎస్.హరికృష్ణ, ఆర్మూర్ పీసీ కె.వినోద్కుమార్, నిజామాబాద్ ట్రాఫి క్ పీసీ ఎం.శేఖర్బాబు ఉన్నారు. కామారెడ్డి జిల్లా నుంచి వీఆర్ అటాచ్డ్ ఎల్లారెడ్డి ఎస్సై పి.మధుసూదన్ రెడ్డి, ఏఆర్ ఎస్సై కె.చంద్రశేఖర్, వీఆర్ అటాచ్డ్ కామారెడ్డి ఎస్సై జి.రాములు, బీర్కూర్ ఏఎస్సై ఎస్.నాగభూషణం, బాన్సువాడ హెచ్సీ పి.బస్వంత్ రావు, బిచ్కుంద హెచ్సీ పి.వెంకటకృష్ణ సేవా పతకాలను అందుకోనున్నారు.