అంబర్పేట: కులనిర్మూలన, మహిళోద్ధరణ, సమన్యాయాన్ని ఆకాంక్షించి తన జీవిత కాలమంతా పరిశ్రమించిన మహా మహోపాధ్యాయుడు, సత్యన్యాయ, సమన్యాయ, సత్యశోధకుడు, సామాజిక పరివర్తకుడు, భారత ప్రథమ సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతారావుపూలే అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహన్రావు కొనియాడారు.
బడుగుల అణచివేత, వివక్షత, బానిస జీవితాల నుండి ఉదాత్తంగా ఎదగాలని పరితపించిన మహాశయుడు పూలే అని వకుళాభరణం అన్నారు. మహాత్మా పూలే 131వ వర్ధంతిని పురస్కరించుకొని అంబర్పేట అలీకేఫ్ చౌరస్తాలో పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్ముడు అణచివేతకు గురవుతున్న ప్రజల పక్షాన పోరాడడమే కాకుండా ఉన్నత వర్ణ వితంతువుల పునర్వివాహానికి, ప్రజల వెట్టిచాకిరి విముక్తికి, మహిళోద్ధరణకు, మహిళా విద్యకు చేసిన కృషి అనితర సాధ్యమన్నారు. గాంధీజీ కంటే ముందుగా మహాత్మునిగా జన నీరాజనాలు అందుకున్న పూలే జీవితం ధన్యమైందని పేర్కొన్నారు.
పూలే ఆశయసాధన దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి ప్రశంసనీయమైనదన్నారు. విద్యా ద్వారనే సమాజ ప్రగతిని ఆశిం చిన మహాత్ముని బాటలో రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, విదేశీ విద్యానిధి, సంక్షేమ పథకాలు సమసమాజ నిర్మా ణానికి బాటలు వేస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికత దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.