డీజీపీ మహేందర్రెడ్డి
నారాయణపేట, మార్చి 30 : దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్లను, ఎస్పీలను డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. జిల్లాలోని పోలీస్ ఉన్నతాధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ల్లో నమోదైన కే సులు, పెండింగ్లో ఉన్న కేసులపై సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి వాటి సంఖ్యను తగ్గించేలా అన్ని స్థా యిల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సం బంధించి డాక్యుమెంట్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్స్ త్వరగా తెప్పించుకొని ప్రతిరో జు కేసుల లక్ష్యాన్ని నిర్దేశించుకొని పూర్తి చేయాలన్నారు. మహిళలు, పిల్లల రక్షణ విషయంలో ప్ర త్యేక దృష్టి సారించాలని, మహిళలు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకున్న వెంటనే స్పందించి న్యా యం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా కేసు నమోదు చేయ డంతో నిందితులను అరెస్టు చేయాలన్నారు. ఫో క్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల విషయంలో పూర్తి సాక్ష్యాలతో దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని సూచించారు.
చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నా రు. సమావేశంలో ఎస్పీ చేతన, డీఎస్పీ మధుసూదన్రావు, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, ఐటీ కోర్ టీం పాల్గొన్నారు.