ఆర్కేపురం: పేద ప్రజల సేవే లక్ష్యంగా లయన్స్క్లబ్ హైదరాబాద్ ధరణి ముందుకు సాగుతుందని లయన్స్క్లబ్ హైదరాబాద్ ధరణి అధ్యక్షుడు సీహెచ్.ఆనంద్, కార్యదర్శి కోట్ల రాంమోహన్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320ఏ జిల్లా గవర్నర్ ఎస్.రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఆర్కేపురం సాయిబాబా ఆలయంలో 300 మందికి ఆహార పొట్లాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్.రాధా క్రిష్ణ జన్మదినం సందర్భంగా ఈ నెల 13 నుంచి 20 వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. నిరుపేద ప్రజలకోసం లయన్స్క్లబ్ హైదరా బాద్ ధరణి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి అప్పల రాజు, జోనల్ చైర్పర్సన్ కె.యాదయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.