ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కరీంనగర్, సిరిసిల్ల బల్దియాలు మెరిశాయి. ఉత్తమ ప్రతిభచూపాయి. సరికొత్త పద్ధతుల్లో సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతున్న కరీంనగర్ నగరపాలక సంస్థకు ఇన్నోవేషన్ ప్రాక్టిసెస్లో రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు వరించగా, ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో పట్టణ ప్రజలకు వినూత్న మౌలిక సదుపాయాలు కల్పించడంలో సిరిసిల్ల బల్దియాకు పురస్కారం వచ్చింది. ఇక పారిశుధ్య నిర్వహణలో కోరుట్ల మున్సిపాలిటీకి బెస్ట్ పర్ఫార్మెన్స్ గుర్తింపు దక్కింది. శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ వై సునీల్రావు, కమిషనర్ సేవా ఇస్లావాత్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కమిషనర్ వెల్దండి సమ్మయ్య, కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, మున్సిపల్ కమిషనర్ మహ్మద్ అయాజ్కు మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ పురస్కారాలు అందజేసి, అభినందించారు.
– కరీంనగర్ కార్పొరేషన్/ సిరిసిల్ల టౌన్/ కోరుట్ల