అంబర్పేట : బాగ్అంబర్పేట డివిజన్ వైభవ్నగర్లో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. గత కొన్నెండ్లుగా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తా నన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు గురువారం ఎమ్మెల్యే వాటర్వర్క్ అధికారులతో కలిసి కాలనీలో పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు తమను డ్రైనేజీ సమస్య తీవ్రంగా వేధిస్తున్నదని చెప్పారు. వాన పడ్డప్పుడు తాము పడే అవస్థలు వర్ణణాతీతమని పేర్కొన్నారు. ప్రతి రెండు, మూడు రోజులకోసారి మ్యాన్హోళ్లు ఓవర్ ఫ్లో అయి రోడ్డు వెంట మురుగు పారుతుందని వాపోయారు.
స్థానికులు నడవలేని పరిస్థితి ఉంటుందని, భరించలేని దుర్వాసన వెదజల్లు తుందని ఆవేదన వ్యక్తం చేశారు.కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యతో తాము బాధపడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైభవ్నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వాటర్వర్క్ డీజీఎం సతీష్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, కాలనీవాసులు సురేష్కుమార్, డా.హరిచరణ్, డా.ఎం.ఎన్.చారి, మధుసూధన్రెడ్డి, ప్రొ.వివేక్, డా.వినోద్, రామకృష్ణ, శ్రీనివాస్, గణేష్, సుమన్, సిద్ధార్థ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీరాములుముదిరాజ్, కెంచె మహేష్ తదితరులు పాల్గొన్నారు.