తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షురాలు (అమెరికా), ప్రముఖ సంఘసేవకురాలు కవితా చల్లా సామాజిక సేవకు గాను కళాసేవారత్న పురస్కారాన్నిఅందుకున్నారు. నటరాజ్ అకాడమీ, యువకిరణం సంయుక్తాధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గల ఆడిటోరియంలో ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఉబవంతు ట్రస్ట్ చైర్మన్ టి. చిరంజీవులు పురస్కారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కవిత బయోపిక్ను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు సమాజానికి హితోధికంగా సేవా చేయాలని అప్పుడే మానవజన్మ సుకృతమవుతుందని చిరంజీవులు సూచించారు. కవిత సేవలు మరింతగా విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.
సనాతన సమధర్మప్రచార పరిషత్ అధ్యక్షులు విజయ శంకరస్వామి, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, నృత్య గురువు డాక్టర్ ఎస్.పి భారతి తదితరులు హాజరై కవిత సేవలను ప్రశంసించారు. ఇందిరాప్రియదర్శిని కళాశాల విద్యార్థులు ఈ సందర్బంగా శ్రీనివాస కళ్యాణం ప్రత్యేక నృత్య ప్రదర్శనతో భక్తిభావాన్ని పెంపొందించారు.