అబిడ్స్ : జమాయత్ ఉల్ మామినత్ ముద్రించిన నూతన సంవత్సరం క్యాలండర్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ, రాష్ట్ర వక్భ్ బోర్డు డైరెక్టర్ వహీద్ అహ్మద్లు ఆవిష్కరించారు. డాక్టర్ ముప్తీ మహ్మద్ మస్తాన్ అలీ ఖాద్రీ ఆధ్వర్యం లో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహమూద్ఆలీ మాట్లాడుతూ క్యాలండర్ ముద్రించిన వారికి అభినందనలు తెలిపారు.
వక్బ్బోర్డు డైరెక్టర్ వహీద్ అహ్మద్ మాట్లాడుతూ నూతన క్యాలండర్లో ప్రపంచ సమాచారాన్ని పొందు పర్చడం సంతోష కమన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ మహ్మద్ సాబేర్ పాష ఖాద్రి ఇమాం, ముఫ్తి అబ్దుల్ రహీం, అహ్మద్ పాష, ఖైజర్ పాష ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.