మాదాపూర్ :ట్రైన్ దిగి లగేజీని కిందకు దించుతుండగా ప్రయాణికురాలు హ్యండ్ బ్యాగును ఓ వ్యక్తి దొంగిలించాడు. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమై ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రైల్వే జీఆర్పి సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం … కొండాపూర్కు చెందిన ఎస్. సరోజిని చింకారి (39) అనే మహిళ పూణేలోని వారి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళి ఈ నెల 23న లింగంపల్లిలో ఎల్టిటి (లోక్ మన్యా తిలక్ ఎక్స్ప్రెస్) ట్రైన్ దిగింది. తన వెంట ఉన్న మూడు బ్యాగుల లగేజీని రైల్ నుండి కిందకు దించుతుండగా ఎన్. సిద్ధప్ప (42) అనే వ్యక్తి ఆమె వద్ద నుంచి హ్యండ్ బ్యాగును దొంగిలించాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీ ద్వారా సిద్ధప్పను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హ్యండ్ బ్యాగులో నల్లపూసల గొలుసుతో పాటు చేవిదుద్దులు, నగదు ఉన్నాయి. వాటి విలుల 62వేల800లుగా పోలీసులు గుర్తించారు. కేసును చేదించిన వారిలో ఆర్పిఎఫ్ ఎస్సై సుబ్బారావు, వీరస్వామి, ఏఎస్సైలు ఉన్నారు.