హిమాయత్నగర్ : చేనేత పరిశ్రమపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సాయంత్రం నారాయణ గూడలోని పద్మశాలీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డుతూ సంక్షోభంలో ఉన్న చేనేత రంగంను ఆదుకోవడంతో పాటు జీఎస్టీ నుంచి చేనేతకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్రావు పలుమార్లు కేంద్ర మంత్రికి లేఖలు రాశారని గుర్తు చేశారు.
కట్టుకునే వస్త్రాలపై పన్ను వేయడం అన్యా యమని, పన్నులు వేయడం వల్ల చేనేత వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2022 జనవరి 5 న జరిగే హ్యాండ్లూమ్ మార్చ్కు మద్దతు ఇచ్చి పాల్గొంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని చేనేత రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేవరకు బలమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఆప్కో మాజీ ఛైర్మన్ గడ్డం జగన్నాధం, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యరమాద వెంకన్న, సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు కంద గట్లస్వామి, పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్, నాయకులు వనం దుశ్యంతల, శంకరయ్య,గాజుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.