కవాడిగూడ : కసిరెడ్డి నారాయణ రెడ్డి రెండవ సారి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల ఉమ్మడి రాష్ర్ట చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డిలు అభినందించారు.
సోమవారం తిరుమల హిల్స్లోని ఆయన నివాసంలో కలిసిన వారు చేనేత షాలువాతో సత్కరించి పూల బొకెను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కసిరెడ్డి నారాయణరెడ్డి మరెన్నో ఉన్నత పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల ప్రతినిధులు యానాల రాధిక తదితరులు పాల్గొన్నారు.