నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల బాధ్యులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేయించిన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
మోర్తాడ్, జనవరి17: మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గంగమ్మ ఆలయ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రూ.40లక్షలను దేవాదాయ శాఖ ద్వారా మంజూరు చేయించారు. ఈ మేరకు మంత్రి నివాసంలో నిధుల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని గంగపుత్ర సంఘం సభ్యులకు సోమవారం అందజేశారు. కోరగానే ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన మంత్రికి గంగపుత్రసంఘం సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. ఎంపీపీ శివలింగుశ్రీనివాస్, జడ్పీటీసీ బద్దంరవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి, సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్, ఎంపీటీసీ అస్మా అజారుద్దీన్, రవి, రామకృష్ణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ మండపం నిర్మాణానికి రూ.32 లక్షలు..
భీమ్గల్, జనవరి 17: మండలంలోని చేంగల్ వేంకటేశ్వర ఆలయం వద్ద నిర్మించనున్న కల్యాణ మండపానికి రూ.32లక్షల నిధులను ప్రభుత్వం మంజూరుచేసింది. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని మంత్రి ప్రశాంత్రెడ్డి హైదరాబాద్లోని ఆయన నివాసంలో సర్పంచ్ గంగారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
మల్లన్నస్వామి ఆలయ నిర్మాణానికి రూ.50లక్షలు..
ఏర్గట్ల, జనవరి 17: మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో మల్లన్న స్వామి ఆలయ నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు కాగా అందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని మంత్రి ప్రశాంత్రెడ్డి యాదవ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం, సర్పంచ్ భీమనాతి భానుప్రసాద్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నాగులపల్లి అంజిరెడ్డి తదితరులు సీఎం కేసీఆర్తో పాటు మంత్రి ప్రశాంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి రమేశ్, ఉపసర్పంచ్ క్యాతం దేవేందర్రెడ్డి, నాయకుడు తమ్మడి రాజేశ్, యాదవ సంఘం అధ్యక్షుడు దోడల్ల గంగామల్లేశ్, ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు అశోక్ యాదవ్, ఉపాధ్యక్షుడు నూకల అశోక్, సంఘ సభ్యులు గొల్ల దేవన్న, లక్కం సాయన్న, పెద్ద బావులు, ఎర్రోల్ల సాయన్న తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ పెద్దమ్మ ఆలయానికి రూ.35లక్షలు..
బాల్కొండ, జనవరి 17: బాల్కొండలోని పెద్దమ్మ ఆలయానికి మంజూరైన రూ.35లక్షల ప్రొసీడింగ్ కాపీని మంత్రి ప్రశాంత్రెడ్డి ముదిరాజ్ సంఘ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ సభ్యులు మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ లావణ్యా లింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్యా వెంకటేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బద్ధం ప్రవీణ్రెడ్డి, ఎంపీటీసీ కన్న లింగవ్వ, సర్పంచ్ బూస సునీతా నరహరి, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు తౌటు గంగాధర్, ఉపసర్పంచ్ వాహబ్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పల సాగర్, గ్రామశాఖ అధ్యక్షుడు సాగర్ యాదవ్, నాయకుడు పోశెట్టి, ముదిరాజ్ సంఘ సభ్యులు జనార్దన్, ప్రసాద్, భోజన్న, అశోక్, భాస్కర్, శ్రీకాంత్, యోగేశ్ తదితరులు పాల్గొన్నారు.