ఇందూరు/ విద్యానగర్, జనవరి 16: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగించినట్లు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల విద్యాశాఖాధికారులు దుర్గాప్రసాద్, రాజు తెలిపారు. ఈ మేరకు వారు ఆదివారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉండగా, కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. విద్యార్థులు బయటికి వెళ్లకుండా మాస్కులు ధరించి, జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు గతంలో మాదిరిగానే ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ డీఈవో సూచించారు.