ఎడపల్లి (శక్కర్నగర్), జనవరి 21: హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్నారాయణరెడ్డి సూచించారు. ఎడపల్లి శివారులోని పాత గ్రామం వద్ద బోధన్ నిజామాబాద్ రహదారి డివైడర్ల మధ్య, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రహదారి వెంట నాటిన మొక్కలను ఆయన శుక్రవారం పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత ఫారెస్టు అధికారులదే అని తెలిపారు. స్థానిక పంచాయతీ అధికారులు వారికి సహకరించాలని సూచించారు. ఆర్డీవో రాజేశ్వర్, ఎడపల్లి ఎంపీడీవో శంకర్, ఎంపీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, ఉపసర్పంచ్ ఆకుల శ్రీనివాస్, నాయకుడు ఎల్లయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.
అమ్మా మీ కుటుంబంలో అందరూ బాగున్నారా.. ?
మండలంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన జ్వర సర్వేను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. ‘అమ్మా! మీ కుటుంబంలో అందరూ బాగున్నారా..?’అంటూ పలుకరించారు. ‘కొవిడ్ టీకాలు వేయించుకున్నారా..? 60 ఏండ్లు పైబడి రెండు టీకా లు పూర్తయిన వారు బూస్టర్ టీకాలు వేయించుకోవాలి’అని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూ డాలని జాన్కంపేట్ సర్పంచ్ సాయిలుకు సూచించారు.
పట్టణంలో ప్రగతి పనుల పరిశీలన..
బోధన్, జనవరి 21: పట్టణంలో చేపట్టిన ప్రగతి పనులను కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. పట్టణంలోని ఒకటో వార్డు ‘సీ’బ్లాక్లో ఉన్న ‘మియావాకీ’యాద్రాద్రి ఫారెస్ట్ను సందర్శించారు. దట్టమైన మొక్కలతో మియావాకీ ఆహ్లాదకరంగా ఉందని కలెక్టర్ సంతృప్తి వ్యక్తంచేశారు. అంతకుముందు పట్టణంలోని రాకాసిపేట్లో 10వ వార్డులోని వైకుంఠధామాన్ని పరిశీలించరు. అక్కడ పెద్దపెద్ద మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. కలెక్టర్ వెంట డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ డీఈ ఎ.శివానందం, న్యాయవాది, టీఆర్ఎస్ నాయకుడు ఐ.ఇంద్రకరణ్ తదితరులు ఉన్నారు.