చాదర్ఘాట్ :ఆజంపురా డివిజన్లోని శ్రీ పిలక్మాతా(శ్రీ శీతలాదేవీ) సహిత శ్రీ శివ పంచాయతన శ్రీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మూడురోజులపాటు పూజాది కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి.
గురువారం ఉదయం శ్రీ గణపతి పూజ గర్త సంస్కారము, ఆవాహిత దేవతారాధనలు, హోమాలు, మద్యాహ్నం శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహ సంస్థాన పీఠాదీశ్వరులు శ్రీ మదభినవోద్దండ విద్యా శంకర భారతి స్వాముల కరకమలములచే యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, పూర్ణాతి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
బుధవారం ఉదయం చండీ హోమము, శ్రీ రుద్రహోమము, సాయంత్రం ధాన్యాధివాసము, శయ్యాధివాసము, ఫలాధివాసమ, పుష్పాధివాసము కార్యక్రమాలను నిర్వహించినట్లు దేవాలయ అధ్యక్షుడు ఎ.పరశురాం తెలిపారు. ఈ కార్యక్రమంలో అమర్, మారేపల్లి బాబురావు, దేవేందర్, శ్రీను తదితరులు ఉన్నారు.