ఇందూరు, జనవరి 19 : దుబాయ్లో ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ పుజైరా ఓపెన్ జీ2 ఇంటర్నేషనల్ తైక్వాండో చాంపియన్షిప్కి నిజామాబాద్ జిల్లాకు చెందిన వినోద్నాయక్ ఎంపికయ్యారు. గత నెల 28, 29వ తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన సీనియర్ ట్రయల్స్లో ప్రతిభ కనబర్చిన 20 మందిని మనదేశం తరఫున ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు ఎంపిక కాగా.. జిల్లాకు చెందిన క్యూరియస్ అకాడమీ కోచ్ వినోద్నాయక్ ఇందులో ఒకరు కావడం గమనార్హం. ఆరు సంవత్సరాలుగా అంతర్జాతీయ, తైక్వాండో చాంపియన్షిప్లలో పాల్గొని 20కి పైగా పతకాలను సాధించి 2019లో అకాడమీని స్థాపించడంతోపాటు విద్యార్థులకు శిక్షణ ఇస్తూ జాతీయస్థాయి వరకు తీసుకెళ్లారు వినోద్ నాయక్. వినోద్తోపాటు వివిధ దేశాల నుంచి పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ చాంపియన్షిప్లో పాల్గొననున్నారు. ఈ చాంపియన్షిప్లో పాల్గొనడానికి సుమారు లక్ష వరకు ఖర్చు అవుతుందని, క్రీడాభిమానులు, దాతలు తనకు ఆర్థిక సహకరించాలని వినోద్ కుమార్ కోరుతున్నారు. ఈ పోటీల్లో పాల్గొని దేశానికి, రాష్ర్టానికి జిల్లాకు మంచి పేరు తీసుకువస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సహాయం చేయాలనుకునే వారు 97058 02480 నంబరుకు కాల్ చేయాలని కోరారు.