ఆర్మూర్, జనవరి 17 : కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు వడ్లు కొనేది లేదని తెగేసి చెప్పడంతో రైతులు ఇంతర పంటలు సాగు చేసేలా రాష్ట్ర ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాయితీలను ఇస్తూ పండ్లతోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. ఏండ్లుగా వరి పంట వేసి నష్టాల పాలవుతున్న రైతులు పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 5,301 ఎకరాల్లో పలు రకాల పండ్ల తోటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరంలో మరో 60 నుంచి 70 ఎకరాల్లో పండ్ల తోటల సాగును పెంచేలా ఉద్యానవన శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నది. దీంతో పాటు జిల్లా రైతులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆయిల్ పామ్ తోటలను సైతం సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దీని కోసం ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రా మంలో ఆయిల్పామ్ నర్సరీలో మొక్కల పెంపకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా రైతులకు ఈ పంట సాగుపై ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్నది.
పండ్ల తోటల పెంపకానికి రాయితీ
నిజామాబాద్ జిల్లా రైతాంగం ఇప్పటి వరకు 5301 ఎకరాల్లో మామిడి, జామ, సీతాఫల్ తదితర పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. రైతులు వాణిజ్య పంటల సాగును ఎంచుకోవడంతో వారికి భారం పెరుగుతున్నదని భావించి ప్రభుత్వం రాయితీలను ఇస్తున్నది. ఈ సీజన్లో జిల్లాలో సుమారు 60 నుంచి 70 ఎకరాల్లో పండ్ల తోటలను సాగు చేయించాలనే లక్ష్యంతో జిల్లా ఉద్యానవనశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నారు. పండ్ల తోటల పెంపకం కోసం మూడు సంవత్సరాల పాటు 40 శాతం మేర రాయితీని అందిస్తున్నారు. జిల్లాలోని రైతులతో ఆయిల్ పామ్ తోటలను సాగు చేయించాలని ఉద్యానవన శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో సుమారు 10వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టి దీన్ని వచ్చే ఐదేండ్లలో సుమారు 55 వేల ఎకరాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనబోమని చెబుతున్న నేపథ్యంలో జిల్లాలోని రైతాంగం ఇప్పటికైనా పంట మార్పిడి విధానాలకు శ్రీకారం చుట్టి.. వరి పంటకు స్వస్తి పలికి పండ్ల తోటల పెంపకానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో రైతులు సాగు చేసే పండ్ల తోటల పెంపకం కోసం మూడేండ్ల పాటు 40 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. రాయితీ డబ్బులను రైతులు సద్వినియోగం చేసుకొని పండ్ల తోటల పెంపకానికి ముందుకు రావాలి. జామ, సీతాఫల్, మామిడి తోటల పెంపకంతో పాటు ఈ ఏడాది జిల్లాలో ఆయిల్ పామ్ తోటలను సైతం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నాం. వచ్చే సీజన్లో జిల్లాలో ఈ పంట సాగును పెంచేందుకు కృషి చేస్తున్నాం.
పండ్ల తోటల పెంపకానికి 40 శాతం రాయితీ
జిల్లాలో రైతులు సాగు చేసే పండ్ల తోటల పెంపకం కోసం మూడేండ్ల పాటు 40 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. రాయితీ డబ్బులను రైతులు సద్వినియోగం చేసుకొని పండ్ల తోటల పెంపకానికి ముందుకు రావాలి. జామ, సీతాఫల్, మామిడి తోటల పెంపకంతో పాటు ఈ ఏడాది జిల్లాలో ఆయిల్ పామ్ తోటలను సైతం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నాం. వచ్చే సీజన్లో జిల్లాలో ఈ పంట సాగును పెంచేందుకు కృషి చేస్తున్నాం.
-సుమన్, ఉద్యానవనశాఖ అధికారి ఆర్మూర్