అమీర్పేట్ : మద్యం మత్తులో కింద పడిపోయిన వ్యక్తికి చేయూతనందించాల్సింది పోయి.. అతని ద్వీచక్ర వాహనం, సెల్ఫోన్తో ఉడాయించిన ఘటన సనత్నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బాలానగర్ ప్రాంతానికి చెందిన శేఖర్ (40) మద్యం సేవించి తన ద్విచక్ర వాహనంపై బల్కంపేట నుండి ఫతేనగర్ ఫ్లై ఓవర్ మీదుగా వెళుతున్నాడు. కాగా ఫ్లై ఓవర్ మీదకు రాగానే బ్యాలెన్స్ ఆగక వాహనం పై నుండి కింద పడిపోయాడు. అదే అదనుగా గుర్తు తెలియని వ్యక్తి అతని ద్విచక్ర వాహనం ప్యాషన్ ప్రో, సెల్ఫోన్తో ఉడాయించాడు.
కొంత సేపటికి విషయం తెలుసుకున్న శేఖర్ జరిగిన ఘటనను సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.