చాదర్ఘాట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మలక్పేట సలీంనగర్లోని కార్యాలయంలో నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందును ఉచితంగా పంపిణీ చేశారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళీమోహన్రాజు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మారం భరత్రెడ్డి తెలిపారు.
కరోనా మహమ్మారి ని తరిమికొట్టేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్.రామచంద్రరావు, టి.అంజయ్య, ప్రసాద్రావు, మదన్మోహన్ రావు, దామోదర్ రావ, కనకయ్య, వినయక్కమార్ తదితరులు పాల్గొన్నారు.