అంబర్పేట : బాగ్అంబర్పేట డివిజన్లోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ బాడ్మింటన్ కోర్టును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం ఆయన కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
కోర్టు చుట్టు ఫెన్సింగ్ వేయించాలని, మట్టి సరైన లేవెలింగ్ లేక ఇబ్బంది పడుతున్నామని క్రీడాకారులు చెప్పారు. వృద్ధులు కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని, అలాగే కోర్టు అభివృద్ధికి అవసరమైన నిధులు సకాలంలో మంజూరు చేసేలా చూడాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.
వెంటనే ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఈ కాలనీ ప్రెసిడెంట్ జీఎస్ రావు, వైస్ ప్రెసిడెంట్ రవి రుద్రశెట్టి, కోశాధికాఇర మోర రాజు, జాయింట్ సెక్రటరీ సునీల్రెడ్డి, అనిల్గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజిరెడ్డి, సభ్యులు ఆనంద్ దరి, కరణ్రెడ్డి, అడ్వయిజర్ రమణయ్య, ఫణికుమార్, అధికార ప్రతినిధి డా.మార్త రమేష్ తదితరులు పాల్గొన్నారు.