ఉస్మానియా యూనివర్సిటీ : వచ్చే నెల 9 న నిర్వహించనున్న తమ చిన్న కుమార్తె తేజస్వి వివాహ వేడుకకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి దంపతులు బుధవారం ఆహ్వానించారు.
ప్రగతిభవన్లో కేసీఆర్ను కలిసిన డిప్యూటీ మేయర్ దంపతులు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని కోరారు.