కొండాపూర్ : ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని శేరిలింగంపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీనయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని సర్వే నెంబర్ 174లోని ప్రభుత్వ భూమిలో వెలసిన నిర్మాణాన్ని బుధవారం రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల కబ్జాకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ప్రభుత్వ భూములపై ఎప్పటికప్పుడు రెవెన్యూ విభాగం ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. చందానగర్లోని సర్వే నెంబర్ 174లో చేపట్టిన నిర్మాణదారుడిపై చందానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా సదరు నిర్మాణదారుడిపై చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కూల్చివేతల్లో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.